పంజాబ్’కు పంచ్ పడింది !

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలివాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ అదరగొట్టింది. పంజాబ్ కు పంచ్ ఇచ్చింది. పంజాబ్ పై  ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నాలుగు వికెట్లకు 185 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలో లైఫ్ లభించిన క్రిస్‌ గేల్ (99; 63 బంతుల్లో, 6×4, 8×6) విధ్వంసం సృష్టించాడు.

అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్‌ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌ (50; 26 బంతుల్లో, 6×4, 3×6), సంజు శాంసన్‌ (48; 25 బంతుల్లో, 4×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో రాజస్థాన్‌ 12 పాయింట్లతో అయిదో స్థానానికి ఎగబాకింది.