తెలంగాణలో 922 కేసులు, 1,456 రికవరీ 

కరోనా నుంచి తెలంగాణ క్రమంగా కోలుకుంటోంది. రోజూవారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 922 కొత్త కేసులు నమోదయ్యాయ్. అదే సమయంలో 1456 మంది కరోనా నుంచి పూర్తి గా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య  2,21,992కి చేరింది.

ఇక తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,40,970కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,348కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,717 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 256 కేసులు నమోదయ్యాయి.