డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్’కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుడు, సెలబ్రిటీ, రాజు, బంటు అందరికీ సోకుతోంది. తాజగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ లోనూ కరోనా కలకలం మొదలైంది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

తాజాగా కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని ఇటీవల తాను కలిసినట్లు స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అయితే, తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం.. కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు ఇంటి నుంచే పనిచేస్తానని చెప్పారు. ఇక డబ్ల్యూహెచ్‌వో పేద దేశాలకు సమానంగా వ్యాక్సిన్‌, ఔషధాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.