తెరాసలో చేరిన రావుల

తెలంగాణ బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి తెరాసలో చేరారు. తెలంగాణ భనన్ లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రావుల తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రావుల తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ సీఎం కేసీఆర్ చేతిలోనే భద్రంగా ఉంటుందన్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో తెరాస, భాజాపా దూకుడుగా వ్యవహరించాయ్. మాటల యుద్ధం చేసుకున్నాయ్. కేంద్రం సాయంపై తెరాస భాజాపాకు సవాల్ విసిరింది. భాజాపా అదే స్థాయిలో తెరాస ప్రభుత్వంపై ప్రతి దాడి చేసింది. దుబ్బాక ఉప ఎన్నికతో తెరాసకు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా భాజాపా వ్యవహరించింది. అయితే దుబ్బాక పోలింగ్ కు ఒకరోజు ముందు ఆ పార్టీ నేత రావుల తెరాసలో చేరడం విశేషం.