ఓటుకు నోటు కేసు : సండ్ర వెంకట వీరయ్యకు చుక్కెదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.  ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

సోమవారం సండ్ర డిశ్చార్జి పిటిషన్‌తో పాటు, ఉదయ్‌ సింహ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. కాగా, ఓటుకు కోట్లు పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతో ఏసీబీ కోర్టు ఆయనను గతంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి తెదేపా నేత, తాజా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాడెండ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసు వెనక తెదేపా అధినేత చంద్రబాబు ఉన్నాడనే ఆరోపణలున్నాయి.