దుబ్బాక ఓటర్లకు రాములమ్మ విజ్ఝప్తి ఏంటంటే ?

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ మొదలైపోయింది. అయితే పోలింగ్ మొదలైన సమయంలో దుబ్బాక ఓటర్లకి కాంగ్రెస్ మహిళా నేత, సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ విజ్ఝప్తి చేసింది. తెరాసది దొరల పాలన. వారి పాలన నిజాం నవాబులని తలపిస్తోంది. దుబ్బాక ప్రజలు తెరాసకు బుది చెప్పాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు వరుస ట్విట్లు చేశారమె.

‘నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో తరతరాల తెలంగాణ చరిత్ర చెబుతుంది. అదే ధోరణిలో నేటి నయా టీఆరెస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి… తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవం విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలలో టీఆరెస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నాను’.