తెలంగాణ కేబినేట్ నుంచి నలుగురికి ఉద్వాసన ?

తెలంగాణ రాజకీయాలకి సంబంధించి రెండు విషయాలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకటి త్వరలోనే మంత్రి కేటీఆర్ ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారని చెప్పుకొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత అది ఉంటుందని చెప్పుకొంటున్నారు. అంతే.. వచ్చే యేడాది జనవరిలో కేటీఆర్ కి పట్టాభిషేకం ఉండొచ్చని టాక్.

మరో విషయం ఏంటంటే.. ? సీఎం కేసీఆర్ కేబినేట్ విస్తరణకు రెడీ అవుతున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. మొత్తం నలుగురు మంత్రులకి ఉద్వాసన తప్పదు. ఈ లిస్టులో రాసలీల మంత్రి ఒకరు అని చెబుతున్నారు. ఇదీగాక.. ఎమ్మెల్సీగా ఎంపికైన కవితని కేబినేట్ లోకి తీసుకొనే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. మరీ.. ఈ ప్రచారాలు నిజమవుతాయేమో చూడాలి.