డేంజర్ : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విజృంబిస్తోంది. ఇటీవల కరోనా కొత్త కేసులు వెయ్యిలోపు నమోదవ్వడం చూశాం. ఆపై 1500లోపు నమోదవ్వడం చూశాం. ఇప్పుడు ఏకంగా 1500దాటి కొత్త కొత్త కేసులు నమోదయ్యాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,539 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,45,862కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,362కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 978 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,25,664కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,656 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 15,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.