దేశంలో.. మరోసారి 50వేలు దాటిన కరోనా కేసులు !

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయ్. గడిచిన 24 గంటల్లో 50,210 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 83,64,086కి చేరింది. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 55,331గా ఉంది. ఇప్పటివరకు 77,11,809 మంది కోలుకున్నారు.

గత 24 గంటల్లో 704 మంది మరణించగా..ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 1,24,315 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 5,27,962కి చేరాయి. ఈ రేటు6.31 శాతానికి తగ్గింది. అలాగే వైరస్ బారినపడి కోలుకున్న వారి శాతం 92.20గా ఉంది.