ఫైనల్ కి చేరిన ముంబై 

టీ20 లీగ్‌ 13వ సీజన్‌లో ముంబై ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబయి 200 పరుగుల భారీ స్కోరు చేసింది.ఓపెనర్‌ డికాక్‌ 40(25బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌), ఇషాన్‌ కిషన్‌ 55(30 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ 51(38బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్య 37(14బంతుల్లో 5సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

201 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన కేవలం 143 పరుగులే చేయగలిగింది పరుగుల ఖాతా తెరవకుండానే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీషా, అజింక్య రహానె, శిఖర్‌ ధావన్‌ ముగ్గురు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రేయస్‌ అయ్యర్‌ 12(8బంతుల్లో), పంత్‌ 3(9) మరోసారి విఫలమయ్యాడు. స్టాయినీస్‌ 65(46 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ 42(33బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సలరు) కాస్త పోరాడారు.ముంబయి బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్‌ 2 వికెట్లు తీసి దిల్లీని దెబ్బ కొట్టారు. బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.