మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

టాలీవుడ్ ని షాక్ గురి చేసే న్యూస్ ఇది. మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ ట్విట్ చేశారు. 
‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే  హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’ అని చిరు ట్విట్ చేశారు.

శనివారం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సీఎం కేసీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా థియేటర్ల ఓపెనింగ్ పై చర్చించారు. అంతేకాదు.. ఇటీవల హైదరాబాద్ లో భారీ వర్షాలు-వరదల సమయంలో ప్రకటించిన విరాళాలకు సంబంధించిన చెక్ లని సీఎం కేసీఆర్ కు అందించారు. అయితే  ఇప్పుడు చిరుకి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సీఎం కేసీఆర్ లోనూ కరోనా కలవరం మొదలైనట్టు తెలుస్తోంది.