దుబ్బాక విజయం కార్యకర్తలకి అంకితం : సంజయ్

దుబ్బాక ఉప ఎన్నికలో భాజాపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు దాదాపు 1300పైగా మెజారిటీతో తెరాస అభ్యర్ఠి సోలిపేత సుజాతపై గెలుపొందారు. దీంతో భాజాపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక పోలింగ్ కేంద్రం నుంచి బయటికొస్తో.. దుబ్బాక విజయం స్పందించారు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్. దుబ్బాక ప్రజలు చైతన్య వంతలు, ఈ విజయం కార్యకర్తలకి అంకితం చేస్తున్నామని సంజయ్ ప్రకటించారు.సీఎం కేసీఆర్ అహంకార పాలనకి ప్రజలు చెప్పిన బుద్ది ఇది అన్నారు.

మొదటి నుంచి దుబ్బాక విజయం భాజాపా నమ్మకంగానే ఉంది. ఎన్నికల ప్రచారంలో తెరాసతో హోరిహోరీగా పోరాడింది. ఫైనల్ గా ఉత్కంఠపోరులో గెలుపొందింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడక.. వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ తెరాస విజయం సాధిస్తూ వస్తోంది. తొలిసారి తెరాస విజయయాత్రకు భాజాపా చెక్ పెటింది. అంతేకాదు..తెలంగాణ చరిత్రలోనే ఇంతటి ఉత్కంఠ పోరుని చూడలేదు అన్నట్టుగా సాగింది. తాజా ఐపీఎల్ టోర్నీలోనూ ఇంతటి మజాని పంచిన మ్యాచ్ లేదనే చెప్పాలి.