మెగాస్టార్ కోసం నటి ప్రత్యేక పూజలు

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. మెగా అభిమానులు చిరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. కొన్ని చోట్ల చిరు కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ప్రముఖ నటి నవీనా రెడ్డి కూడా దేవాలయంలో మెగాస్టార్ పేరుమీద అర్చనలు జరిపిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడుని వేడుకున్నారు. నవీనా రెడ్డి ఎఫ్ 2, వెంకీ మామ, భీష్మ, ఉప్పెన, వంటి సినిమాలలో నటించారు. నాని నిర్మాత గా విశ్వక్ షేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమాలో లేడి కిల్లర్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ప్రస్తుతం అర్ధ శతాబ్దం, దేవినేని, ప్లాన్ బి వంటి సినిమాలలో నవీనారెడ్డి నటిస్తున్నారు.

‘సినిమా ఇండస్ట్రీ లో తనకు రోల్ మోడల్ అయిన మెగాస్టార్ గారు కరోనా బారిన పడటం తనను ఎంతగానో కలచివేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా మన వస్తారనే నమ్మకం తనకు ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నా’నని నవీనా రెడ్డి తెలిపారు.