‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ కోసం కాస్ట్లీ సెట్

కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్. ఇటీవల ఇటలీలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకొంది. ఈ సినిమా సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌ కోసం నిర్మాతలు దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నారని టాక్.

హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ నిక్‌ పోవెల్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోనే యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారని సమాచారం. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, తదితరులు ‘రాధేశ్యామ్‌’ సినిమాలో నటిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, ప్రసిద్ధ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.