బాలయ్య పక్కన ఇద్దరు కాదు.. ముగ్గురు !


బాల‌కృష్ణ‌- బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్లు ఖ‌రార‌య్యారు. సాయేషా సైగ‌ల్‌, పూర్ణ‌ల‌ను హీరోయిన్లుగా ఫిక్స్ చేశారు. అయితే ఇందులో మ‌రో హీరోయిన్ కూడా ఉంద‌ని స‌మాచారం. ప్ర‌గ్యా జైస్వాల్‌ని మూడో హీరోయిన్ గా ఎంపిక చేశార‌ని తెలుస్తోంది.

ప్ర‌గ్యా ఓ పాట‌కే ప‌రిమితం కానున్న‌ద‌ని స‌మాచారం. బోయ‌పాటి ‘సింహా’లో వ్యాంపు త‌ర‌హా పాత్ర ఒక‌టుంది. ఆ పాత్ర‌లో న‌మిత క‌నిపించింది. స‌రిగ్గా అలాంటి మ‌సాలా పాత్ర‌లోనే ప్ర‌గ్యా జైస్వాల్ క‌నిపించ‌నుంద‌ని టాక్‌. ప్రగ్యాతో కలిసి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ వచ్చి చేరినట్టుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్రానికి సూపర్ మేన్ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.