ఏపీలో 1,593 కొత్త కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,593 కొత్త కేసులు నమోదయ్యాయ్. ఒక్కరోజు వ్యవధిలో 10 మంది బాధితలు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,847కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 2,178 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,24,189 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,262 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.