స్నేహితులతో మందు పార్టీ.. ఆపై పోలీస్ వాహనం చోరి !

మద్యం మత్తులో మనం ఏం చేస్తున్నామో అర్థం కాదంటారు. ఓ యువకుడు ఏకంగా పోలీస్ వాహనంతోనే జంప్ అయ్యాడు. అదీకూడా సీఐ ముందే ఈ చోరి ప్రయత్నం చేశాడు. నేరేడు చర్లమండలం ముకుందాపురానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నిన్న మిర్యాలగూడ సమీపంలోని ఈదెలగూడెంకు వచ్చి.. తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రే రోడ్డుపక్కన మద్యం సేవిస్తు్న్నాడు.

అది గమనించిన సీఐ రమేశ్‌బాబు వారిని విచారించేందుకు అక్కడికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు వంశీ అక్కడి నుంచి తప్పించుకొని పోలీసు వాహనంతో పరారయ్యాడు. అతడి పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. సినిమా స్టోరీలా నడిచిన ఈ ఏపీసోడ్ జిల్లాలో సంచలనంగా మారింది.  ఆళ్లగడప టోల్‌గేట్‌ వద్ద వంశీని పట్టుకొని అరెస్టు చేశారు.