గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు.. అభ్యర్థులని ఖరారు చేసిన కేసీఆర్ ! 

సీఎం కేసీఆర్ ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకి అభ్యర్థులని ఖరారు చేశారు. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.

దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాల కోసం కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపించాయ్. ఫైనల్ గా వీరి నుంచి గోరేటి వెంకన్న, సారయ్య, దయానంద్ పేర్లుని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.