ఆహా కోసం నలుగురు టాప్ దర్శకులు

వందశాతం తెలుగు కంటెంట్ తో ‘ఆహా’ పేరిట ఓటీటీ ఫ్లాట్ ఫాంని తీసుకొచ్చారు నిర్మాత అల్లు అరవింద్. ఈ యాప్ కోసం దాదాపు రూ. 1500కోట్ల బడ్జెట్ అంచనాతో రంగంలోకి దిగారట. అంతేకాదు.. ఆహా కోసం టాలీవుడ్ టాప్ దర్శకులని రంగంలోకి దించబోతున్నారు. వారి పేర్లని నిన్న జరిగిన ఆహా లాంచ్ కార్యక్రమంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించారు.

సుకుమార్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి.. ఈ నలుగురు దర్శకులు ఆహా కోసం షోస్ చేయబోతున్నారని బన్నీ ప్రకటించారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ఆహా కోసం ‘సామ్ జామ్’ షో చేస్తోంది. ఈ షోకి తొలి అతిథిగా టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఇప్పటికే ఆహాలో రిలైజైన కల్లర్ ఫోటో, అమరం అఖిలం ప్రేమ, ఓరేయ్ బుజ్జిగా తదితర సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయ్. ఇక నలుగు టాప్ దర్శకుల నుంచి షోస్ వస్తే… ఆహా క్రేజ్ మరింత పెరగొచ్చని చెబుతున్నారు. ఈ నలుగు దర్శకులు  కూడా బన్నీతో సినిమా చేసినవారే కావడం విశేషం.