డిసెంబర్ 11 నుంచి థియేటర్స్ ఓపెన్.. కానీ !

తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 నుంచి థియేటర్స్ తెరచుకోనున్నాయ్. వాస్తవానికి ఇప్పటికే థియేటర్స్ రీ ఓపెన్ కి కేంద్రం అనుమతులిచ్చింది. కానీ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచింది. కేంద్రం థియేటర్స్ కి అనుమతులు ఇచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరచుకోలేదు.

తాజాగా డిసెంబర్ 11 నుంచి థియేటర్స్ ఓపెనింగ్ కి అనుమతులు ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోలో ఆక్యుపెన్సీపై స్పష్టత ఇవ్వలేదు. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరచుకోవాలా  ? లేక 100శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చారా ? అన్నది స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో థియేటర్స్ యాజమాన్యాలు కన్పూజన్ లో ఉన్నారు. దీనిపై క్లారిటీ కోరే అవకాశాలున్నాయ్. ఇక థియేటర్స్ తెరచుకున్నా.. కొత్త సినిమాలు విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఓటీటీలో రిలీజైన సినిమాలని థియేటర్స్ లోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.