రస్మిక.. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా !

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందనకు గూగుల్ సప్రైజ్ ఇచ్చింది. ఆమెని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా పేర్కొంది. దిశా పటాని, మనుషీ చిల్లర్‌, ప్రియ ప్రకాష్ వాయిర్‌లకు మాత్రమే దక్కిన ఈ గౌరవం రష్మికకు దక్కడం విశేషంగా చెబుతున్నారు.

రస్మిక ఇప్పటి వరకు దక్షిణాదికే పరిమితం అయింది. ఆమె ఒక్క బాలీవుడ్ చిత్రం కూడా చేయలేదు. అలాంటిది ఆమెని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం విశేషం. దీనికి గూగుల్ ఆసక్తికర సమాధానం చెప్పింది. ఛలో, గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు హిందీలో డబ్ అయ్యాయి. అక్కడి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయ్. దీంతోపాటు రష్మిక వాడే డ్రెస్ కోడ్‌.. కాస్ట్యూమ్స్ కూడా నచ్చడంతో రష్మిక నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గూగుల్ గుర్తించినట్టు చెబుతున్నారు.