కుత్భుల్లాపూర్ బీజేపీ ఆఫీసుపై కార్యకర్తల దాడి

జీహెచ్ఎంసీ ఎన్నికలకి నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయినా.. సీట్ల పంపకాల వివాదాలు వివాదాలు ఇంకా చెల్లారలేదు. టికెట్ దక్కని నేతలు పార్టీపై ఆగ్రహం చూపిస్తున్నారు. తాజాగా కుత్భుల్లాపూర్ లో బీజేపీ ఆఫీసుపై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆఫీసులోని ఫర్నీచర్ ని ధ్వంసం చేశారు. నేతలు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

స్థానిక బీజేపీ నేతలు, అధిష్టానంపై తిట్ల వర్షం కురిపించారు. అసలు గ్రేటర్ లో భాజాపాకి అభ్యర్థులు దొరకరని ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీలో టికెట్ దక్కిని ఆశావాహులు ఆ పార్టీపై దుమ్మెత్తిపోయడం చూస్తున్నారు. అన్నీ పార్టీల్లోనూ రెబల్ తలనొప్పులున్నాయ్. అయితే ఇలా ఆఫీసుపై దాడికి దిగడం మాత్రం కుత్భుల్లాపూర్ లోనే జరిగింది.