తెలంగాణ కాంగ్రెస్ నేతలని బీజేపీలోకి పంపుతున్న సోనియా గాంధీ.. ఇదీ కూడా వ్యూహామేనా !?


జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కంగ్రెస్ ఖాళీ అవుతోంది. గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు భాజాపాలోకి క్యూ కడుతున్నారు. కమలం పార్టీలో ఖర్చీప్ వేసేందుకు పోటీ పడుతున్నారు. భాజాపాలో స్థానం దక్కితే ఎమ్మెల్యేగా గెలిచినంత హ్యాపీగాఫీలవుతున్నారు. ఈ జాబితాలో గల్లీ నేతల నుంచి ఢిల్లీ నేతల వరకు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, వారి కుమారులు ఉన్నారు.

మరో విశేషం ఏంటంటే ? తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీజేపీలోలో వెళ్లడానికి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆశీర్వాదం కూడా ఉందట. సోనియా గాంధీ భక్తుడు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సర్వే సంచలన కామెంట్ చేశారు. సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. అలవాటులో పొరపాటుగా సర్వే సోనియా గాంధీ ఆశీర్వాదం ఉందని అన్నారా ? లేక నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలని స్వయంగా సోనియానే బీజేపీలో పంపిస్తుందా ? అని జనాలు నవ్వుకుంటున్నారు. హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమానులైతే దీని వెనక వ్యూహాం ఉందేమో అనుకుంటున్నారు.