‘లూసీఫ‌ర్’ రిమేక్ మళ్లీ దర్శకుడు మారాడు

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ‘లూసీఫ‌ర్’పై మనసు పడ్డాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా రిమేక్ బాధ్యతలని మొదట సుజీత్ కి అప్పగించారు. ఆ తర్వాత వివి. వినాయ‌క్ వ‌చ్చాడు. వినాయ‌క్ కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా కోసం హ‌రీష్ శంక‌ర్ పేరు వినిపించింది. ఇప్పుడు `లూసీఫ‌ర్‌` రేసులో మ‌రో ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరాడు.

అతడే మోహ‌న్ రాజా. ధృవ సినిమాకి మాతృక అయిన `త‌ని ఒరువ‌న్‌`కి ద‌ర్శ‌కుడు ఇతడే. ప్రస్తుతం`త‌ని ఒరువ‌న్ 2` తెర‌కెక్కిస్తున్నారు. మోహ‌న్ రాజా.. ఎడిట‌ర్‌ రాజా కుమారుడు. ఎడిట‌ర్ రాజాకీ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అడిగే సరికి మోహ‌న్ రాజా కాదనలేకపోయాడని తెలిసింది. త్వరలోనే లూసీఫర్ రిమేక్ దర్శకుడిగా మోహన్ రాజా పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు.