మహేష్ చిత్రానికి పూరి.. ఆల్ ది బెస్ట్ !

మహేష్ బాబు – పూరి జగన్నాథ్ లది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ సూపర్ హిట్ అయ్యాయ్. పోకిరి అయితే ట్రెండ్ సెట్ చేసింది. మహేష్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన చిత్రమిది. ఇక పూరి-మహేష్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా ‘జనగనమణ’ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విషయంలో వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తినట్టు ప్రచారం జరిగింది. ఇకపై మహేష్ తో సినిమా చేసేది లేదంటూ పలు ఇంటర్వ్యూలో పూరి చెప్పారు. కానీ మహేష్ మాత్రం పూరి ఎప్పుడంటే అప్పుడు రెడీ అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల పూరితో మహేష్ మాట్లాడారు. ఓ సినిమా చేద్దామనే ప్రపొజల్ పెట్టారనే వార్తలు వినిపించాయ్.

ఇప్పుడీ ఇది నిజమే అనిపిస్తుంది. పూరి-మహేష్ మధ్య నెలకొన్న గ్యాప్ తొలగిపోయిందని తెలుస్తోంది. ఎందుకంటే ? పరశురామ్ దర్శకత్వంలో మహెష్ నటించనున్న సర్కారు వారి పాట సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూరిని ఆహ్వానించారు. కానీ ఆయన హాజరుకాలేదు. దీనిపై పూరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నేను ముంబైలో ఉండ‌టం వల్ల పూజా కార్య‌క్ర‌మానికి రాలేక‌పోయాను. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశాడు. స‌ర్కారు వారి పాట చిత్రం ప‌ర‌శురాంకు మోస్ట్ ఎక్జైటెడ్ వెంచ‌ర్ అని పూరీ ట్వీట్ చేశాడు. ఈ చిత్రం హీరో  మ‌హేశ్ బాబు అభిమానుల అంచ‌నాలకు ఏ మాత్రం త‌గ్గకుండా ఉంటుంద‌న్నాడు. మ‌హేశ్ ఫ్యాన్స్ పండ‌గేనని పూరి రాసుకొచ్చాడు. దీంతో.. త్వరలోనే పూరి-మహేష్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంపై ప్రకటన రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.