రానా అనారోగ్యం.. షాకింగ్ నిజాలు !

హీరో రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి గతంలో రకరకాల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయ్. ఓ కిడ్ని తల్లి దానం చేసిందనే ప్రచారం జరిగింది. రానా కూడా బాగా బక్కచిక్కి కనిపించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకి గురయ్యారు. చికిత్స తీసుకున్న తర్వాత రానా కోలుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రానా పెళ్లి కూడా  జరిగిపోయింది.అయితే రానా ఆరోగ్యంపై అసలు నిజాలేంటీ ? అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.

తాజాగా ఆహా కోసం సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి రానా దగ్గుబాటి పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని వదిలారు. ఇందులో రానా ఆరోగ్యంపై జరిగిన ప్రచారంపై సామ్ వివరణ కోరింది. ‘చిన్నప్పటి నుండే తనకు బీపి ఉంది. దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుంది. నీ కిడ్నీలు కూడా పాడవుతాయి. బీపీ వలన మెదడులో నరాలు చిట్లే ఛాన్స్ 70 శాతం, చనిపోయే ఛాన్స్ 30 శాతం వైద్యులు చెప్పారు’ అని రానా చెప్పారు. ఈ ఏపీసోడ్ ఈ నెల 27న ప్రసారం కానుంది.