పోలీసులతో బూట్లు నాకిస్తాం.. భాజాపా నేత షాకింగ్ కామెంట్స్ !

భాజాపాకు క్రమశిక్షణ గల పార్టీ అనే పేరుంది. ఆ పార్టీలోని వారు అత్యధికులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. దీంతో వారిలో దేశభక్తి, ప్రజల పట్ల భక్తి ఎక్కువే అని చెబుతుంటారు. అయితే ఇటీవల కాలంలో భాజాపా నేతలు కూడా భరితెగిస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ప్రత్యర్థులు, హైదరాబాద్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత రాజు బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. భాజపా అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని రాజు బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రాష్ట్రంలో జరిగే నేరాలను అరికట్టకుండా కేవలం ప్రభుత్వ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రాజు బెనర్జి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయ్.