తొలి వన్డేలో భారత్ ఓటమి

ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల చేధనలో టీమిండియా వికెట్లు కోల్పోయి 308 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్థిక్ పాండే 90, శిఖర్ ధావన్ 74  పరుగులతో రాణించారు. అయితే వీరిద్దరు అవుట్ కావడంతో కోహ్లీ సేన భారీ లక్ష్యాన్ని చేధించలేక చతికిల పడింది.

అంతకుముందు టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 374 పరుగులు చేసింది. కెప్టెన్ ఫించ్‌, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీలు బాదడంతో టీమిండియా ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్మిత్ కేవలం 62 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 66 బంతుల్లో 105 పరుగులు చేయగా.. కెప్టెన్ ఫించ్ 124 బంతుల్లో 114 పరుగులు చేశాడు. మధ్యలో మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు.