ప్రధాని.. కరోనా వాక్సిన్ అభివృద్ది సంస్థల సందర్శన !

దేశంలో కరోనా వాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్న సంస్థలని ప్రధాని నరేంద్ర మోడీ రేపు సందర్శించనున్నారు. ఇందుకోసం సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్ సహా మూడు నగరాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్‌ నగరాల్లో కోవిడ్-19 వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థలను ప్రధాని సందర్శించనున్నారు. ఈ మేరకు పీఎంవో ఓ ప్రకటన చేసింది.

“వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను స్వయంగా సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రేపు మూడు నగరాల్లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలను ఆయన సందర్శిస్తారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.