కేసీఆర్ సభ కోసం.. గల్లీ గల్లీకో బస్సు !

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆఖరి పంచ్ అదిరిపోయేలా గులాభి పార్టీ ప్లాన్ చేసింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం సర్వం సిద్ధమైంది. మరిన్ని నిమిషాల్లో సీఎం కేసీఆర్ వేదికకు చేరుకోనున్నారు. దాదాపు గంటన్నర పాటు సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. వేదికపై కేసీఆర్ ఒక్కరే మాట్లాడతారని చెబుతున్నారు.

గత పది, పదిహేను రోజులుగా గ్రేటర్ ప్రచారంలో రాజకీయ నేతలు మాటల తూటలు పేల్చుతున్నారు. ముఖ్యంగా భాజాపా అధికార తెరాసని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ తన ప్రచారంలో వాటికన్నింటికి కౌంటర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అవి ప్రతిపక్షాల గూబ గుయ్ మనేలా ఉంటాయని తెరాస శ్రేణులు చెబుతున్నారు.

కేవలం గ్రేటర్ ఎన్నికలు, తెలంగాణ రాజకీయాలు మాత్రమే కాదు.. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతునట్టు సమాచారమ్. నాన్ బీజేపీ, నాగ్ కాంగ్రెస్ కూటమిపై కేసీఆర్ ప్రకటన చేసే ఉంటుందని చెబుతున్నారు. డిసెంబర్ 10 తర్వాత ఢిల్లీకి వెళ్తా. భాజాపా అంతుచూస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం వినడానికి అందరు టీవీలకు అత్తుకుపోయి చూస్తున్నారు.