రాజేంద్ర ప్రసాద్.. గ్రేట్ !

గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయ్. ఈ ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. అయితే నగర ప్రజలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఉదయం 11 గంటల వరకు కనీసం 15శాతం కూడా ఓటింగ్ నమోదుకానీ బూతులున్నాయ్. మరోవైపు సినీ ప్రముఖులు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటికొచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, నాగార్జున.. తదితరులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అరకు నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రశ్నించే హక్కు మనకు రావాలంటే.. మనం తప్పకుండా ఓటు వేస్తేనే ఆ హక్కు ఉంటుందని, ఇది తన అభిప్రాయమన్నారు రాజేంద్ర ప్రసాద్. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కులేదన్నారు.