గ్రేటర్ ఓటర్లకు విజయ్ దేవరకొండ పిలుపు

భాగ్యనగరంలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్లల్లో ఉన్నవారంతా బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. కొద్దిసేపటి క్రితం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఓటు కలిగి ఉన్నవారంతా ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేస్తే మంచి మజా వస్తుందన్నారు. మళ్లీ 4వ తేదీన ఏమవుతోందో చూద్దామన్నారు. కరోనా భయంలేదని ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాట్లు బాగా చేశారని, శానిటైజర్లు పెట్టారని, ఓటర్లు సామాజిక దూరం పాటిస్తున్నారని.. అందుచేత ఎవరూ భయపడకుండా ఓటు వేయడానికి రావాలని కోరారు.