ప్రభాస్-నాగ్ అశ్విని సినిమా వెనక్కు !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టేస్తున్నారు.  ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత  నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇక ఈరోజు మధ్యాహ్నం ప్రభాస్ కొత్త సినిమాపై ప్రకటన రాబోతుందని చెబుతున్నారు. ‘కేజీఎఫ్ 2’ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా ప్రకటన రానుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కొత్త సినిమా ఉండనుందని చెబుతున్నారు. మరికొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.

వాస్తవానికి రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా చేయాలి. ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెని తీసుకున్నారు. మరో కీలక పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ని తీసుకున్నారు. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈ యేడాది డిసెంబర్ నుంచే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ కరోనా విజృంభణతో సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్.

ఇక ఇంతలో ఆదిపురుష్ ని లైన్ లోకి తీసుకొచ్చారు ప్రభాస్. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆర్నెళ్ల పాటు కొనసాగనుందని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్‌లు ఉంటాయి కాబట్టి షూటింగ్‌ను కుదిరినంత త్వరగా పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. ఇక వచ్చే యేడాది డిసెంబర్ నుంచి ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా మొదలవ్వనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ రెండు కూడా 2020లోనే రిలీజ్ కానున్నాయని చెబుతున్నారు.