గ్రేటర్’లో గులాభి సెంచరీపై కవిత ధీమా

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎల్లుండి ఫలితాలు రాబోతున్నాయ్. ఈలోగా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్. తెరాస మాత్రం సెంచరీపై కన్నేసింది. వంద స్థానాల్లో గెలుపు ఖాయం అంటోంది. గ్రేటర్ లో సెంచరీ కొట్టి సత్తా చాటుతామని తెరాస ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. మరీ.. ఆమె సెంచరీ కోరిక తీరుతుందేమో చూడాలి.

మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కవితపై భాజాపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గతంలో కవిత నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు బోధన్‌ అసెంబ్లీలోని నియోజకవర్గంలో తనకు ఓటు ఉన్నట్లు అఫడవిట్‌లో పేర్కొందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్‌ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది.