కోహ్లీ కొత్త రికార్డ్ కొట్టేశాడు

టీంఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఘనత సాధించాడు.

తన కెరీర్‌లో 251 మ్యాచులాడిన కోహ్లీ 242వ ఇన్నింగ్స్‌లో 12 వేల మైలురాయిని అందుకున్నాడు. కాగా, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ 12 వేల పరుగులను చేయడానికి 309 మ్యాచులాడి 300 ఇన్సింగ్స్‌ తీసుకున్నాడు. వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో  విరాట్‌ కోహ్లీ(242 ఇన్నింగ్స్‌),  సచిన్‌ తెందూల్కర్‌(300), రికీ పాంటింగ్‌(314), కుమార సంగక్కర(336), సనత్‌ జయసూర్య(379), మహేల జయవర్దనే(399) ఉన్నారు.