నోముల అంత్యక్రియలకి హాజరైన సీఎం కేసీఆర్

నోముల నర్సింహయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. నోముల స్వగ్రామమైన నకిరేకల్‌ మండలం పాలెంలోని స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నోముల భౌతికకాయానికి నివాళులర్పించి శద్ధాంజలి ఘటించారు.

అభిమాన నాయకుడిని కడసారి చూసి నివాళులర్పించేందుకు అభిమానులు, తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు నోముల నర్సింహయ్యకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గుండెపోటుతో మంగళవారం నోముల హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.