పుష్ప షూటింగ్ క్యాన్సిల్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా ‘పుష్ప’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అర్థాంతరంగా క్యాన్సిల్ అయింది. యూనిట్ లో డజను మంది వరకు కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అర్జెంట్ గా షూటింగ్ ను క్యాన్సిల్ చేసి యూనిట్ అంతా మారేడుమిల్లి నుంచి  వెనక్కు వచ్చేసినట్లు తెలుస్తోంది.

కరోనా విజృంభిస్తున్న వేళ పదుల సంఖ్యలో సిబ్బందితో మాత్రమే షూటింగ్ చేయాలి. కానీ పుష్ప షూటింగ్ ఓ జాతరలా జరుగుతోంది. ప్రతిరోజూ ఎనిమిది తొమ్మిది వందల మంది షూటింగ్ లో పాల్గొంటున్నట్టు సమాచారమ్. షూటింగ్ ఖర్చు రోజుకు నలభై నుంచి యాభై లక్షలు వుంటుందని చెబుతున్నారు. ఇంతటి హడావుడిలో షూటింగ్ చేయడమే.. సమస్యగా మారిందని చెబుతున్నారు.