బాబు.. మీడియా తెలివి చూశారా ?

ఎల్లో మీడియాపై సీఎం జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలని అసెంబ్లీలోకి అనుమతిని ఇవ్వడం లేదు. దీంతో తెదేపాకు మునుపటి ప్రచారం లేకుండా పోయింది. భజన లేదని బాబు బాధలో ఉన్నారు. ఎలాగైనా ఎల్లో మీడియాకు అసెంబ్లీలోనికి అనుమతిని ఇప్పించాలనే పట్టుదలతో బాబు ఉన్నారు.

ఈ నేపథ్యంలో వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి మీడియా నియంత్రణను ఖండిస్తూ అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకూ కాలినడకన నిరసన ర్యాలీ చేపట్టారు. చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా దాడులు ఆపి అసెంబ్లీలోకి అన్ని మీడియా సంస్థలను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ నిరసన ర్యాలీ ప్రధాన ఉద్దేశం మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని. కానీ దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలపై ఏడాదిన్నరగా దాడులు కొనసాగుతున్నాయనే కోటింగి ఇచ్చారు బాబు. అందుకే.. బాబు తెలివే తెలివి అని చెప్పుకొంటున్నారు పసుపు బ్యాచ్.