తెలంగాణలో తగ్గిన కరోనా

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 609 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,71,492కి చేరింది.

నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,465కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 873 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,61,028కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,999 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,922 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ఎఫెక్ట్ తో తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజకీయ నేతలు, పార్టీ శ్రేణులు కూడా 5 నుంచి 7 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు.