బ్రేకింగ్ : భారత్ బంద్’కు పిలుపునిచ్చిన రైతులు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారితో కేంద్ర ప్రభుత్వం పలు దశలుగా చర్చలు జరిగింది. కానీ అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఈ నెల 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకి మద్దతు పెరుగుతోంది. సినీ ప్రముఖులు రైతులకి మద్దతు తెలియజేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో కార్తీ రైతులకు సపోర్ట్ తెలిపారు. మొదట రైతులు ఏం చెబుతున్నారో వినాలని కేంద్రాన్ని కోరారు. కార్తీ బాటలో రైతులకి మద్దతు తెలపడానికి సినీ ప్రముఖులు, సాధారణ ప్రజలు ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.