జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోని కొట్టిన ఎంఐఎం

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వచ్చేసింది. మొదటి నుంచి చెప్పినట్టుగానే తొలి రౌండ్ లోనే మెహదీపట్నం ఫలితం వచ్చేసింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. మరో 20 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఇక గ్రేటర్ లో అత్యధిక స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. జూబ్లీ హీల్స్, పటాన్ చెరువు, హైదరనగర్, కాప్రా, చర్లపల్లి, మీర్ పేట్, బీఎన్ నగర్, ఖైరతాబాద్, సరూర్ నగర్,  రామ్ చంద్రానగర్, శేర్ లింగం పల్లి, ఓల్డ్ బోయిన్ పల్లి, బాలానగర్, చందానగర్, అసిఫ్ పేట్ లలో తెరాస ముందంజలో ఉంది. తెరాస తర్వాత స్థానంలో భాజాపా ఉంది. కాంగ్రెస్ మాత్రం ఏ ఎస్ రావు నగర్ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.