గ్రేటర్ లో కాంగ్రెస్ ఓటమిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ ఫలితాల్లో ఊహించినట్టుగానే ఉన్నాయ్. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా గ్రేటర్ లో కమలం వికసించింది. ఆ పార్టీ దాదాపు 40 స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. తెరాస మేజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోయేలా ఉంది. ఇక గ్రేటర్ లో కాంగ్రెస్ ఖేల్ ఖతం అయినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మరో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఘోర ఓటమిపై ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్ది స్పందించారు.

కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరె.. మీడియా ఏమంది ? అంటే.. ఈ ఎన్నికల్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఓటమికి ఓటర్లు కారణం కాదని.. మీడియానే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు మీడియాను ప్యాకేజీలతో మ్యానేజ్ చేశాయంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మరీ రేవంత్ ఆరోపణలని మీడియా ఎలా తిప్పికొట్టనుంది అనేది చూడాలి.