గ్రేటర్ ఫలితాలు : మేజిక్ ఫిగర్’కు చేరుకోని తెరాస

గ్రేటర్ ఫలితాలు ఆఖరికి వచ్చేసరికి గులాభి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఈజీగా మేజిక్ ఫిగర్ దాటనుంది. 70 స్థానాలకు పైగా గెలవనుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీకి అన్నీ స్థానాలు వచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం తెరాస 51 స్థానాల్లో గెలుపొందింది. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ లెక్కన తెరాస మేజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో ఆగిపోయేలా ఉంది.

మరోవైపు గ్రేటర్ లో భాజాపా బలం చూపించింది. ఓట్లు, సీట్లు పెంచుకుంది. ఇప్పటికే 39 స్థానాల్లో భాజాపా గెలిచేసింది. మరికొన్ని చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ లెక్కన భాజాపా 40 స్థానాలకు పైగా విజయం సాధించబోతున్నట్టు అర్థవుతోంది. ఇక ఎంఐఎం 41 స్థానాల్లో విజయం సాధించింది.