తెలంగాణలో 596 కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 596 పాజిటివ్‌ కేసులు నమోదయాయ్. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,72,719కి చేరింది. మరోవైపు కరోనాతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,470కి చేరింది.

తాజాగా కరోనా నుంచి మరో 972 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,62,751కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,498 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 6,465 మంది ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 102 కేసులు నమోదయ్యాయి.