పీసీసీ రేసు.. నేనే ముందున్నా !

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ ఫైట్ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు అర్జెంటుగా కొత్త అధ్యక్షుడిని నియామించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గ్రేటర్ ఫలితాలు వెలువడిన వెంటనే పీసీసీ పోస్ట్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజనామా చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఫలితాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని తెలిపారు. తన స్థానంలో కొత్త వారిని నియమించాలని అధిష్టానాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో పీసీసీ ఫైట్ మొదలైంది. రేసులో రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిలు ఉన్నారు. అయితే రేసులో తానే ముందున్నానని కోమట్ రెడ్డి ప్రకటించుకున్నారు. తనకు పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఒకే తాటిపైకి తీసుకొస్తానని తెలిపారు. ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. మరోవైపు పీసీసీ బాధ్యతలు రేవంత్ రెడ్డి అప్పగిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ బతుకుతుందని ఆ పార్టీలు నేతలు అంటున్నారు.