వైరల్ : మహేష్ కొత్త లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు యూత్ ఫుల్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు. ఏదో బాలీవుడ్ సినిమా చేసేందుకు రెడీ అయినట్టుగా ఉన్నారు. ఈ లుక్ వైరల్ కావడంపై మహేష్ స్పందించారు. ‘అవినాశ్ గోవారికర్ వంటి ప్రతిభావంతుడైన ఫొటోగ్రాఫర్ తీసిన ఛాయాచిత్రాల్లో ఏది ఫేవరెట్ అంటే ఎంచుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈసారికి ఈ ఫొటోను ఎంచుకుందాం’ అంటూ ట్విట్ చేశాడు.

కరోనా లాక్ డౌన్ టైమ్ లో మహేష్ కొత్త కొత్త లుక్ లని ట్రై చేశారు. అవి సర్కారు వారి పాట కోసమని కొందరు. కాదు.. కాదు.. యాడ్ షూట్ కోసమని మరికొందరు అప్పట్లో కామెంట్స్ చేశారు. అందులో ఒక లుక్ ని తాజాగా మహేష్ అభిమానులతో పంచుకున్నారు. అది కాస్త వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్ రోల్ లో మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.