మహేష్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్ ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటిస్తే చూడాలన్నది ప్రేక్షకుల కోరిక. ఇప్పుడీ.. ఈ కోరిక తీరబోతుందనే ప్రచారం జరుగుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తున్న  ‘సర్కారువారి పాట’లో పవన్‌ అతిథిగా కనిపించనున్నారట. పవన్‌ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్క్రీన్ పై మెరవనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

పవన్‌కల్యాణ్‌ నటించిన ‘జల్సా’కు మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ కోసం పవన్ సాయం చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ న్యూస్ విని ఇటు మహేష్, అటు పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ వరుస సినిమాలని లైన్  లో పెట్టేసిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలని పూర్తి చేయాల్సి ఉంది.