బీజేపీలోకి రాజేంద్ర ప్రసాద్ ?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తోంది భాజాపా. ఇందుకోసం పక్కగా వ్యూహాలని రచిస్తోంది. అమలు చేస్తోంది. అవి ఫలిస్తున్నాయి కూడా. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణ భాజాపాకు ఊపొచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ భాజాపాకు కూడా ఓ మూమెంట్ తీసుకురావడానికి అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రయత్నలు మొదలెట్టారు. ఇందులో భాగంగానే ఆయన సోమవారం నటుడు రాజేంద్ర ప్రసాద్ ని కలిసినట్టు తెలుస్తోంది.

రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చిన సోము.. ఆయనతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ సోము వీర్రాజును శాలువాతో సత్కరించారు. సినీ నటి హేమ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ ని సోము భాజాపాలోకి ఆహ్వానించినట్టు సమాచారమ్. ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సోము.. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లని కలిసిన సంగతి తెలిసిందే. అదే తరహా రెండో దఫా భేటీ అవుతున్నారు సోము. ఇక ఈరోజు భేటీలో రాజేంద్ర ప్రసాద్ ని పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.