సంగీత్’లో దుమ్మురేపిన నిహారిక

నిహారిక పెళ్లి వేడుక కోసం మెగా ఫ్యామిలీ అంతా ఉదయ్ పూర్ చేరుకుంది.సోమవారం నిహారిక తన కుటుంబంతో ఉదయపూర్‌కు ప్రైవేటుగా ఓ విమానంలో వెళ్లారు. మరోవైపు మూడు రోజుల పెళ్లి వేడుకకు హాజరవ్వడానికి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు.. తమ సినిమాలైన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌కి విరామం ఇచ్చి నిన్న సోమవారం ఉదయ్ పూర్‌కు చేరుకున్నారు.

గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో తో నిహారిక వివాహం రేపు (డిసెంబర్ 9)న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌ లో జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంది. నిహారిక చైతన్య జంట మెగాస్టార్‌ చిరంజీవి పాటకు చిందులేశారు. చిరు నటించిన చిత్రం ‘బావగారూ.. బాగున్నారా!’ చిత్రంలోని ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’ పాటకు ఈ జంట వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నిహారిక మాస్ స్టెప్పులతో దుమ్ములేపింది.