తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరొనా కేసులు

గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ తో తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతాయని ముందుగానే అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజం అవుతుంది. ఇటీవల ప్రతిరోజు 700లోపు కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయ్. అయితే గడిచిన 24 గంటల్లో 721 కొత్త కేసులు నమోదయ్యాయ్.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,75,261కి చేరింది.

మరో ముగ్గురు మృతిచెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1480గా నమోదైంది. తాజాగా 753 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,66,120 కి చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,661గా ఉండగా.. వీరిలో 5,576 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు.